సాంప్రదాయికంగా "మే నెలలో అమ్ముకుని బయటపడు" అనే సూత్రాన్ని మార్కెట్ పండితులు ప్రబోధిస్తూ ఉంటారు. కాని ప్రస్తుత మార్కెట్ తీరుకు ఆ సూత్రం వర్తించదని హెడోనోవా హెడ్జ్ ఫండ్ సిఐఓ సుమన్ బెనర్జీ అంటున్నారు. త్వరలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న దశలో మార్కెట్లో సరికొత్త ర్యాలీ అవకాశాలు అధికంగా ఉన్నందు వల్ల ఈ సాంప్రదాయిక సూత్రాన్ని పక్కన పెట్టవచ్చునని నిపుణుల సూచన. మరోపక్క గత దశాబ్ది కాలంగా మే నెలలో నిఫ్టీ సానుకూల రాబడులు అందిస్తోందని కూడా గణాంకాలు నిరూపిస్తున్నాయని బెనర్జీ అన్నారు. భారత్కు గల మెరుగైన వృద్ధి అవకాశాలు, రాబోయే సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటుందన్న ఊహాగానాలు పరిగణనలోకి తీసుకుంటే దీర్ఘకాలిక సంపద సృష్టిపై దృష్టి పెట్టడం మంచి వైఖరి అవుతుందన్నది ఆయన అభిప్రాయం. ప్రస్తుత వాతావరణంలో ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ఆటుపోట్లకు అతీతంగా ఆలోచించి నిలకడ వైఖరి అనుసరించాలని ఆయన సూచిస్తున్నారు.
Wednesday, May 1, 2024
మే నెలలోనూ మార్కెట్లు ముందుకే...
జిఎస్టి వసూళ్లలో కొత్త రికార్డు
ఏప్రిల్ వసూళ్లు రూ.2.10 లక్షల కోట్లు
దేశంలో జిఎస్టి వసూళ్లు కొత్త రికార్డును నమోదు చేశాయి. నూతన ఆర్థిక సంవత్సరానికి శుభారంభాన్ని అందించాయి. జిఎస్టి వసూళ్లు గత ఏడాది ఏప్రిల్తో పోల్చితే 12.4 శాతం పెరిగి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. దేశంలో జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని చేరడం ఇదే ప్రథమం. బలమైన ఆర్థిక వృద్ధికి తోడు దేశీయ లావాదేవీలు, దిగుమతుల్లో ఏర్పడిన వృద్ధి ఇందుకు దోహదపడింది. "ఏప్రిల్ నెలలో జిఎస్టి వసూళ్లు కొత్త మైలురాయిని చేరాయి. రూ,2.10 లక్షల కోట్లు పరోక్ష పన్నుల రూపంలో వసూలయింది. గత ఏడాది ఏప్రిల్తో పోల్చితే ఇది 12.4 శాతం అధికం. దేశీయ లావాదేవీల్లో 13.4 శాతం వృద్ధితో పాటు దిగుమతి లావాదేవీలు 8.3 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది" అని ఆర్థిక శాఖ తెలిపింది. జిఎస్టి వసూళ్లు మార్చి నెలలో రూ.1.78 లక్షల కోట్లు కాగా గత ఏడాది ఏప్రిల్లో రూ.1.87 లక్షల కోట్లు.
జిఎస్టి వసూళ్ల వివరాలు
సెంట్రల్ జిఎస్టి (సిజిఎస్టి) - రూ.43,846 కోట్లు
స్టేట్ జిఎస్టి (ఎస్జిఎస్టి) - రూ.53,538 కోట్లు
ఇంటిగ్రేటెడ్ జిఎస్టి (ఐజిఎస్టి) - రూ.99,623 కోట్లు
(దిగుమతి వస్తువులపై లెవీ రూ.37,826 కోట్లు సహా)
మొత్తం సెస్ వసూళ్లు - రూ.13,260 కోట్లు
(దిగుమతి వస్తువులపై సెస్ రూ.1008 కోట్లు సహా)
అధికారులకు ప్రశంస
ఏప్రిల్ నెలలో జిఎస్టి వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను శాఖ అధికారులను ప్రశంసించారు. "జిఎస్టి వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటడం ప్రశంసనీయం. ఆర్థిక వ్యవస్థలో బలమైన వృద్ధితో పాటు పన్ను వసూళ్లలో సమర్థతకు ఇది గీటురాయి" అని ఆమె ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
వ్యాపార వర్గాలు స్వచ్చందంగా పన్నులు చెల్లించే ధోరణిని అనుసరించడం; సకాలంలో ఆడిట్, పరిశీలన; పన్నుల శాఖ తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని పన్ను నిపుణులంటున్నారు. రాబోయే కాలంలో జిఎస్టి సంస్కరణలు మరింత వేగం పుంజుకోవచ్చునని వారు అభిప్రాయపడ్డారు.
Monday, April 29, 2024
వసూల్ రాజాలూ...కాస్తంత తగ్గండి
...ఆర్బిఐ హెచ్చరిక ఇది. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కస్టమర్లపై వడ్డీ విధించే విషయంలో నానా రకాల అడ్డదారులూ తొక్కుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్న తరుణంలో ఆర్బిఐ వాటిపై దృష్టి పెట్టింది. వడ్డీల విషయంలో అనుచిత దోరణులకు పాల్పడవద్దని, ఒక వేళ ఇప్పటికే అలాంటి ధోరణులకు పాల్పడినట్టయితే సంస్థాగతంగా అవసరమైన మార్పులు చేయడం సహా తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నియంత్రిత సంస్థలను (ఆర్ఇ) ఆదేశించింది. ఇప్పటికే కస్టమర్ల నుంచి వసూలు చేసిన అదనపు చార్జీలు కూడా వాపసు చేయాలని కూడా సూచించింది. 2003 సంవత్సరం నుంచి ఆర్బిఐ తన నియంత్రణలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు వడ్డీరేట్ల విషయంలో తగు స్వేచ్ఛ ఇస్తూనే అనుచిత ధోరణుల కట్టడి కోసం మార్గదర్శకాలు జారీ చేస్తూ వస్తోంది. వడ్డీరేట్ల విషయంలో స్వచ్ఛత, పారదర్శకతను ప్రోత్సహించడం ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం. కాగా ఆర్బిఐ తాజాగా ఒక సర్కులర్ జారీ చేస్తూ "ఆర్బిఐ బృందాలు క్షేత్రస్థాయిలో నిర్వహించిన తనిఖీల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి. 2023 మార్చి 31వ తేదీతో ముగిసిన ఏడాది కాలంలో వడ్డీరేట్ల విషయంలో ఎన్నో అనుచిత ధోరణులు ఆ బృందాల దృష్టికి వచ్చాయి" అని పేర్కొంది. ఈ సర్కులర్ తక్షణం అమలులోకి వస్తుందని కూడా తెలిపింది.వివిధ నియంత్రిత సంస్థలు పాల్పడిన, పాల్పడుతున్న అక్రమాలు కొన్నింటిని కూడా ఆర్బిఐ ప్రస్తావించింది. అవి...
- రుణగ్రహీతకు రుణం అందించిన తేదీ నుంచి కాకుండా రుణం మంజూరు చేసిన తేదీ లేదా రుణ ఒప్పందంపై సంతకాలు చేసిన తేదీ నుంచే కొన్ని సంస్థలు వడ్డీలు వసూలు చేస్తున్నాయి.
- రుణం మొత్తానికి సంబంధించిన చెక్కును కస్టమర్కు అందించిన తేదీ నుంచి కాకుండా చెక్కు తయారుచేసిన తేదీ నుంచే వడ్డీ వసూలు చేస్తున్నాయి. చెక్కు సిద్ధం చేసిన ఎన్నో రోజుల తర్వాత గాని కస్టమర్ చేతికి చెక్కు అందించడంలేదు.
- రుణం తిరిగి చెల్లించిన సమయంలో కూడా ఏ తేదీతో రుణం తీరిపోయిందో ఆ తేదీ వరకు మాత్రమే పరిమితం చేయకుండా నెల మొత్తానికి వడ్డీ వసూలు చేస్తున్నాయి.
- కొన్ని కేసుల్లో ఆయా సంస్థలు ఒకటి లేదా రెండు వాయిదాలు అడ్వాన్స్ గా వసూలు చేసినా పూర్తి మొత్తానికే వడ్డీ వసూలు చేస్తున్నాయి.
ఈ వారంలో 22725 పైన బుల్లిష్
ఏప్రిల్ 29-మే 3 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్
------------------------------
తిథి : చైత్ర బహుళ షష్ఠి
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
Monday, April 22, 2024
ఒక్క రోజులో 4,71,751 విమాన ప్రయాణాలు
విమానయానం కొత్త రికార్డు
దేశీయంగా విమానయాన రంగం ఒక కొత్త రికార్డును నమోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 మంది ప్రయాణికులు వివిధ గమ్యాలకు విమానాల్లో ప్రయాణించారు. ఒకే రోజులో అధిక సంఖ్యలో ప్రయాణించిన రికార్డు ఇది. కొవిడ్ ముందు ఒక రోజు ప్రయాణికుల సగటు 3,98,579తో పోల్చితే ఇది 14 శాతం అధికం. ఇప్పటివరకు ఒక రోజు అధిక ప్రయాణికుల రికార్డు 2023 ఏప్రిల్ 21వ తేదీన నమోదైన 5899 విమానాల్లో 4,28,389 మంది ప్రయాణికులు కాగా ఈ ఏప్రిల్ 21న 6128 విమానాల్లో 4,75,751 మంది ప్రయాణించి ఆ రికార్డును చెరిపేశారు. ప్రతీ రోజూ విమానయానం కొత్త శిఖరాలకు చేరుతోందని పౌర విమానయాన శాఖ ఎక్స్ పోస్ట్లో తెలిపింది. స్థిరమైన విధానాలు, ఆర్థిక పురోగతి, తక్కువ వ్యయంతో ప్రయాణ సౌకర్యం కల్పించే విమానయాన సంస్థల విస్తరణ దేశీయ విమానయానానికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి-మార్చి నెలల మధ్య కాలంలో దేశీయ విమానయాన సంస్థలు వివిధ గమ్యాలకు తరలించిన ప్రయాణికుల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 375.04 లక్షల నుంచి 391.46 లక్షలకు పెరిగినట్టు పౌరవిమానయాన రెగ్యులేటర్ డిజిసిఏ గత వారంలో ప్రకటించింది. అంటే విమాన ప్రయణికుల వృద్ధిరేటు నెలవారీగా 3.68 శాతం ఉండగా వార్షికంగా 4.38 శాతం ఉంది.
Sunday, April 21, 2024
ఈ వారంలో 22550 పైన బుల్లిష్
ఏప్రిల్ 15-19 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్
------------------------------
తిథి : చైత్ర శుక్ల చతుర్దశి
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
Monday, April 15, 2024
ద్రవ్యోల్బణం కట్టడిపై ప్రభుత్వంతో ఘర్షణ తప్పలేదు
ప్రణబ్ ముఖర్జీ, పి.చిదంబరం నాయకత్వలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బిఐని విభిన్న రకాలుగా ఒత్తిడికి గురి చేసేదా...? అవుననే అంటున్నారు ఆర్బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. తాజాగా రచించిన "Just A Mercenary?: Notes from My Life and Career" (కేవలం ఒక కూలీ? : నా జీవితం, కెరీర్ నుంచి కొన్ని ఘట్టాలు) పుస్తకంలో ఆయన ఈ విషయం వివరించారు. వారిరువురి నాయకత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీరేట్లు తగ్గించాలని, ప్రజల మనోభావాలను ప్రభావితం చేసేందుకు వీలుగా దేశంలో ఆర్థిక స్థితి అంతా సజావుగా ఉన్నట్టు నివేదికలు ఇవ్వాలని ఆర్ బిఐని ఒత్తిడి చేస్తూ ఉండేదని తెలిపారు. అయితే ప్రభుత్వానికి, కేంద్ర బ్యాంకుకు మధ్య సంఘర్షణ ఒక్క భారతదేశానికి లేదా ఏదైనా ఇతర వర్థమాన దేశానికే పరిమితం కాదని; సంపన్న దేశాల్లో కూడా ఇలాంటి ఘర్షణాత్మక వైఖరి కనిపిస్తూ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. చిదంబరం, ముఖర్జీ ఇద్దరితోనూ తనకు ఇలాంటి సంఘర్షణాత్మక వాతావరణం ఉండేదని, అయితే వారిద్దరి వైఖరిలోనూ భిన్న ధోరణి మాత్రం ఉండేదని ఆయన పేర్కొన్నారు. చిదంబరం ఎంతో తెలివిగా ఒక న్యాయవాది వలె తన వాదాన్ని వినిపించే వారని, కాని సర్వోత్కృష్ట రాజకీయవేత్త అయిన ముఖర్జీ అందుకు భిన్నంగా తన అభిప్రాయం మాత్రం తెలియచేసి కేసును వాదించే బాధ్యత అధికారులకు వదిలివేసే వారని ఆయన తెలిపారు. ధోరణి ఏదైనా కూడా అది ఆర్బిఐకి మాత్రం అసౌకర్యంగానే ఉండేదని సుబ్బారావు వివరించారు.
Sunday, April 14, 2024
ఈ వారంలో 21320 దిగువన బేరిష్
------------------------------
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
మే నెలలోనూ మార్కెట్లు ముందుకే...
స్టాక్ మార్కెట్లు గత కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలంగా...
-
fo r May 21, 2019 Forenoon Better Tithi : Vaisakha Bahula Tadiya Nakshatra : Moola Persons born in Rohini, Hasta, Shravanam...
-
ఆగస్ట్ 6 - 11 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ నిఫ్టీ : 19517 (-129) గత వారంలో నిఫ్టీ 19867 - 19588 పాయింట్ల మధ్యన కదలాడి 96 ...
-
సెప్టెంబర్ 18-22 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ నిఫ్టీ : 20192 (+372) గత వారంలో నిఫ్టీ 19810 - 20222 పాయింట్ల మధ్యన కదలా...