Monday, April 22, 2024

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు


దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 మంది ప్ర‌యాణికులు వివిధ గ‌మ్యాల‌కు విమానాల్లో ప్ర‌యాణించారు. ఒకే రోజులో అధిక సంఖ్య‌లో ప్ర‌యాణించిన రికార్డు ఇది. కొవిడ్ ముందు ఒక రోజు ప్ర‌యాణికుల స‌గ‌టు 3,98,579తో పోల్చితే ఇది 14 శాతం అధికం. ఇప్ప‌టివ‌ర‌కు ఒక రోజు అధిక ప్ర‌యాణికుల రికార్డు 2023 ఏప్రిల్ 21వ తేదీన న‌మోదైన 5899 విమానాల్లో 4,28,389 మంది ప్ర‌యాణికులు కాగా  ఈ ఏప్రిల్ 21న 6128 విమానాల్లో 4,75,751 మంది ప్ర‌యాణించి ఆ రికార్డును చెరిపేశారు. ప్ర‌తీ రోజూ విమాన‌యానం కొత్త శిఖ‌రాల‌కు చేరుతోంద‌ని పౌర విమాన‌యాన శాఖ ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది. స్థిర‌మైన విధానాలు, ఆర్థిక పురోగ‌తి, త‌క్కువ వ్య‌యంతో ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించే విమాన‌యాన సంస్థ‌ల విస్త‌ర‌ణ దేశీయ విమాన‌యానానికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలిపింది. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది జ‌న‌వ‌రి-మార్చి నెల‌ల మ‌ధ్య కాలంలో దేశీయ విమాన‌యాన సంస్థ‌లు వివిధ గ‌మ్యాల‌కు త‌రలించిన ప్ర‌యాణికుల సంఖ్య గ‌త ఏడాది ఇదే కాలంతో పోల్చితే 375.04 ల‌క్ష‌ల నుంచి 391.46 ల‌క్ష‌ల‌కు పెరిగిన‌ట్టు పౌర‌విమాన‌యాన రెగ్యులేట‌ర్  డిజిసిఏ గ‌త వారంలో ప్ర‌క‌టించింది. అంటే విమాన ప్ర‌య‌ణికుల వృద్ధిరేటు నెల‌వారీగా 3.68 శాతం ఉండ‌గా వార్షికంగా 4.38 శాతం ఉంది. 

Sunday, April 21, 2024

ఈ వారంలో 22550 పైన బుల్లిష్

ఏప్రిల్ 15-19 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  22147 (-372)
 
   
గత వారంలో నిఫ్టీ 21778 - 22427 పాయింట్ల మధ్యన కదలాడి 372 పాయింట్ల నష్టంతో 22147 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 22550 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 22270, 22142, 21633, 20574 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 22550       బ్రేక్ డౌన్ స్థాయి : 21750

నిరోధ స్థాయిలు : 22350, 22450, 22550 (22250 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 21950, 21850, 21750 (22050 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    
  
Ø  గ్రహగతులివే...
ü కన్యలోని హస్త పాదం 3 నుంచి వృశ్చికంలోని అనురాధ పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü మీనంలోని రేవతి పాదం 2-3 మధ్యలో వక్రగతిలో బుధ సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 1-మేషంలోని అశ్విని పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü కుంభంలోని పూర్వాభాద్ర పాదం 3-4 మధ్యలో  కుజ సంచారం
ü మేషంలోని కృత్తిక పాదం 1లో ధనుస్సు నవాంశలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1లో మేష నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 2లో రాహువు, కన్యలోని హస్త పాదం 4లో కేతువు కర్కాటక, సింహ నవాంశల్లో సంచారం        

--------------------------------- 


తొలి గంట మెరుగు (సోమవారానికి)  

తిథి :  చైత్ర శుక్ల చతుర్దశి                                                              

నక్షత్రం : హస్త                               
అప్రమత్తం :     పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; తుల, కుంభ రాశి జాతకులు    
ట్రెండ్ మార్పు సమయం : 1.16
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.49 వరకు మెరుగ్గా ఉంటూ ఆ తర్వాత 2.02 వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి 2.30 వరకు నిస్తేజంగా ఉంది ఆ తర్వాత  చివరి వరకు నిలకడగా  ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 11.45  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 22240, 22325     మద్దతు : 22050, 21950
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, April 15, 2024

ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డిపై ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌లేదు


ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, పి.చిదంబ‌రం నాయ‌క‌త్వ‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్‌బిఐని విభిన్న ర‌కాలుగా ఒత్తిడికి గురి చేసేదా...? అవున‌నే అంటున్నారు ఆర్‌బిఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ దువ్వూరి సుబ్బారావు. తాజాగా ర‌చించిన  "Just A Mercenary?: Notes from My Life and Career" (కేవ‌లం ఒక కూలీ? :  నా జీవితం, కెరీర్ నుంచి కొన్ని ఘ‌ట్టాలు) పుస్త‌కంలో ఆయ‌న ఈ విష‌యం వివ‌రించారు. వారిరువురి నాయ‌క‌త్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వ‌డ్డీరేట్లు త‌గ్గించాల‌ని, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప్ర‌భావితం చేసేందుకు వీలుగా దేశంలో ఆర్థిక స్థితి అంతా స‌జావుగా ఉన్న‌ట్టు నివేదిక‌లు ఇవ్వాల‌ని ఆర్ బిఐని ఒత్తిడి చేస్తూ ఉండేద‌ని తెలిపారు. అయితే ప్ర‌భుత్వానికి, కేంద్ర బ్యాంకుకు మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఒక్క భార‌త‌దేశానికి లేదా ఏదైనా ఇత‌ర‌ వ‌ర్థ‌మాన దేశానికే ప‌రిమితం కాద‌ని; స‌ంప‌న్న దేశాల్లో కూడా ఇలాంటి ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి క‌నిపిస్తూ ఉంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. చిదంబ‌రం, ముఖ‌ర్జీ ఇద్ద‌రితోనూ త‌న‌కు ఇలాంటి సంఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం ఉండేద‌ని, అయితే వారిద్ద‌రి వైఖ‌రిలోనూ భిన్న ధోర‌ణి మాత్రం ఉండేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. చిదంబ‌రం ఎంతో తెలివిగా ఒక న్యాయ‌వాది వ‌లె త‌న వాదాన్ని వినిపించే వార‌ని, కాని స‌ర్వోత్కృష్ట రాజ‌కీయ‌వేత్త అయిన‌ ముఖ‌ర్జీ అందుకు భిన్నంగా త‌న అభిప్రాయం మాత్రం తెలియ‌చేసి కేసును వాదించే బాధ్య‌త అధికారులకు వ‌దిలివేసే వార‌ని ఆయ‌న తెలిపారు. ధోర‌ణి ఏదైనా కూడా అది ఆర్‌బిఐకి మాత్రం అసౌక‌ర్యంగానే ఉండేద‌ని సుబ్బారావు వివ‌రించారు.

కేంద్ర బ్యాంకు స్వ‌యంప్ర‌తిప‌త్తిపై ప్ర‌భుత్వంలో అతి త‌క్కువ అవ‌గాహ‌న‌, సునిశిత‌త్వం ఉండేవ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అటు ప్ర‌భుత్వంలోను, ఇటు ఆర్‌బిఐలోను ప‌ని చేసిన వ్య‌క్తిగా తాను ఈ విష‌యం చెబుతున్నాన‌ని ఆయ‌న అన్నారు. సుబ్బారావు కేంద్రంలో ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా 2007-08 కాలంలో ప‌ని చేశారు. ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద కార్పొరేట్ వైఫ‌ల్యంగా పేరొందిన లేమ‌న్ బ్ర‌ద‌ర్స్ దివాలా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డానికి (2008 సెప్టెంబ‌రు 16) కొద్ది రోజుల ముందే 2008 సెప్టెంబ‌రు 5వ తేదీన సుబ్బారావు 5 సంవ‌త్స‌రాల కాలానికి ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు.

"Reserve Bank as the Government's Cheerleader?" (ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌న్నింటికీ తానా తందానా అంటూ వంత‌పాడే పాట‌గాడుగా రిజ‌ర్వ్ బ్యాంక్ పేరిట రాసిన అధ్యాయంలో వ‌డ్డీరేట్లు త‌గ్గించాల‌నేందుకే ప్ర‌భుత్వ ఒత్తిడి ప‌రిమితం కాలేద‌ని సుబ్బారావు స్ప‌ష్టం చేశారు. ఆర్థిక శాఖ ఒత్తిడి వ‌డ్డీరేట్ల త‌గ్గింపున‌కే ప‌రిమితం కాలేద‌ని, చివ‌రికి గ‌డ్డు స్థితిలో ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థలో అంతా స‌జావుగానే ఉన్న‌ట్టు చెప్పాల‌న్న స్థాయికి కూడా చేరింద‌ని ఆయ‌న వివ‌రించారు. అలాంటి ఒక సంఘ‌ట‌న‌ను ఆయ‌న వెల్ల‌డించారు. 

"అప్ప‌ట్లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అర్వింద్ మ‌యారామ్ ఆర్థిక కార్య‌ద‌ర్శిగా, కౌశిక్ బ‌సు ప్ర‌భుత్వ ముఖ్య ఆర్థిక స‌ల‌హాదారుగా ప‌ని చేస్తున్నారు. వారంద‌రూ ఆర్‌బీఐ అంచ‌నాల‌కు భిన్నంగా త‌మ అంచ‌నాలు ప్ర‌తిపాదించారు. అవి మా అంచ‌నాల‌కు చాలా దూరంగా ఉన్నాయ‌ని నేను భావించాను" అని రాశారు. చివ‌రికి సంభాష‌ణ‌లు హేతుబ‌ద్ధ‌త నుంచి స్వార్థ‌పూరిత ల‌క్ష్యాల దిశ‌గా మార‌డం త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని చెప్పారు. అధిక వృద్ధి, త‌క్కువ ద్రవ్యోల్బ‌ణం ఉన్న‌ట్టుగా అంచ‌నాలు ఇవ్వాల‌ని వారు కోరేంత వ‌ర‌కు సంభాష‌ణ‌లు వెళ్లాయ‌న్నారు.
"ఒక ద‌శ‌లో అయితే మ‌యారామ్ ప్ర‌పంచంలో అన్ని దేశాల ప్ర‌భుత్వాలు, కేంద్ర బ్యాంకులు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటున్నాయి. కాని ఆర్‌బిఐ అందుకు భిన్నంగా ధిక్కార ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంది" అన్నార‌ని సుబ్బారావు వెల్ల‌డించారు. 

ప్ర‌భుత్వానికి వంత‌పాట‌దారుగా ఆర్‌బిఐ ఉండాల‌న్న డిమాండు త‌న ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌యింద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. అయితే  వృత్తిప‌ర‌మైన స‌మ‌గ్ర‌త‌ను వ‌దిలి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను శాంతింప‌చేసే విధంగా ఆర్‌బిఐ అంచ‌నాలు ఇవ్వ‌కూడ‌ద‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల తాను ప్ర‌ద‌ర్శించాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 

2012 అక్టోబ‌రులో చిదంబ‌రం ఆర్థిక‌మంత్రిగా తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఒక సంఘ‌ట‌న‌ను కూడా సుబ్బారావు ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ముఖ‌ర్జీ యంత్రాంగం అనుస‌రించిన కాఠిన్యాన్ని తొల‌గించి స‌ర‌ళ‌మైన వైఖ‌రి అనుస‌రించాల‌ని భావించిన చిదంబ‌రం వ‌డ్డీరేట్లు త‌గ్గించాల‌ని ఆర్‌బిఐపై ఎన‌లేని ఒత్తిడి తెచ్చార‌ని, అయినా తాను లొంగ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. త‌న తిర‌స్కార ధోర‌ణి చిదంబ‌రం త‌న వైఖ‌రిని ప్ర‌జ‌ల ముందుకే తీసుకెళ్లాల‌ని భావించార‌ని కూడా మాజీ ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ద్ర‌వ్యోల్బ‌ణ ధోర‌ణులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆర్‌బిఐ క‌ఠిన‌త‌ర ద్ర‌వ్య విధానం ప్ర‌క‌టించిన కొద్ది సేప‌టికే నార్త్ బ్లాక్ (ఆర్థిక శాఖ కార్యాల‌యం) వెలుప‌ల మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ" ద్ర‌వ్యోల్బ‌ణంతో పాటుగా వృద్ధి కూడా కీల‌క‌మే.  వృద్ధి విష‌యంలో ఎదుర‌వుతున్న స‌వాలును ప్ర‌భుత్వం ఒంట‌రిగానే ఎదుర్కొనాల్సి వ‌స్తే ఒంట‌రి పోరాటం చేయ‌డానికి కూడా మేం సిద్ధం" అన్నార‌ని సుబ్బారావు గుర్తు చేసుకున్నారు.

కెరీర్ ప్రారంభం నుంచి త‌న ప్ర‌యాణంలోని ముఖ్య ఘ‌ట్టాల‌ను, త‌న ఆశ‌లు, నిరాశ‌లు;  త‌న విజ‌యాలు, వైఫ‌ల్యాలు; త‌న త‌ప్పులు, పొర‌పాట్లు;  తాను నేర్చుకున్న పాఠాలు అన్నీ 74 సంవ‌త్స‌రాల సుబ్బారావు ఈ పుస్త‌కంలో స‌వివ‌రంగా ప్ర‌స్తావించారు. 1974లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉత్త‌ర కోస్తాలోని పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన స‌మ‌యంలో గిరిజ‌నాభివృద్ధి విష‌యంలో మ‌రింత ఉత్సాహం, పేద‌రికం గురించి మ‌రింత అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌డం ప్ర‌ధాన‌మ‌ని తాను భావించిన‌ట్టు చెప్పారు. స‌రిగ్గా 40 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీవ్ర‌మైన విదేశీమార‌క ద్ర‌వ్య సంక్షోభం న‌డుమ‌న 2013లో ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న కాలంలో అస‌మాన‌త‌ల‌తో అల్లాడుతున్న ప్ర‌పంచంలో వ‌ర్థ‌మాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ఎదుర్కొంటున్న క‌ఠోర స‌వాళ్ల గురించి తాను తెలుసుకోగ‌లిగాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. సుబ్బారావు ప్ర‌స్తుతం అమెరికాకు చెందిన యేల్ జాక్స‌న్  విశ్వ‌విద్యాల‌యం సీనియ‌ర్ ఫెలోగా ప‌ని చేస్తున్నారు.


Sunday, April 14, 2024

ఈ వారంలో 21320 దిగువన బేరిష్

ఏప్రిల్ 15-19 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  21519 (-1)
 
   
గత వారంలో నిఫ్టీ 22776 - 21504 పాయింట్ల మధ్యన కదలాడి 1 కన్నా తక్కువ పాయింట్ల నష్టంతో 21519 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 21320 కన్నాదిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 22270, 22142, 21633, 20574 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 22820       బ్రేక్ డౌన్ స్థాయి : 22420

నిరోధ స్థాయిలు : 22720, 22820, 22920 (22620 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 21420, 21320, 21220 (21420 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    

Ø  గ్రహగతులివే...
ü మిథునంలోని పునర్వసు పాదం 2 నుంచి సింహంలోని పూర్వఫల్గుణి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
ü మీనంలోని రేవతి పాదం 3లో బుధ సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 1-3 మధ్యలో శుక్ర సంచారం
ü కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2-3 మధ్యలో  కుజ సంచారం
ü మేషంలోని భరణి  పాదం 3-కృత్తిక పాదం 1 మధ్యలో వృశ్చిక నవాంశలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1లో మేష నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 3లో రాహువు, కన్యలోని హస్త పాదం 4లో కేతువు కర్కాటక, సింహ నవాంశల్లో సంచారం        

--------------------------------- 


మిడ్ అవర్ మెరుగు (సోమవారానికి)  
తిథి :  చైత్ర శుక్ల సప్తమి                                                             
నక్షత్రం : పునర్వసు 
అప్రమత్తం :    అశ్విని, మఖ, మూల నక్షత్ర;   మిథున, తుల  రాశి  జాతకులు   
ట్రెండ్ మార్పు సమయం : 2.13
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.04 వరకు నిస్తేజంగా ఉంటూ ఆ తర్వాత 12.16 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి 2.30 వరకు నిస్తేజంగా ఉంది ఆ తర్వాత  చివరి వరకు మెరుగ్గా  ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12.10  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 22615, 22700     మద్దతు : 22425, 22350
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 


Thursday, April 4, 2024

మూడు కోట్ల మారుతి


దేశంలో సుజుకి మోటార్ కార్పొరేష‌న్ (ఎస్ఎంసి) మూడు కోట్ల కార్ల ఉత్ప‌త్తి మైలురాయిని దాటింది. అయితే త‌న మాతృదేశంలో ఈ మైలురాయిని సాధించిన స‌మ‌యం క‌న్నా వేగంగా ఎస్ఎంసి భార‌త్ లో ఈ రికార్డు న‌మోదు చేసింది.  ఈ ఏడాది మార్చి చివ‌రి నాటికి త‌మ అనుబంధ సంస్థ మారుతి సుజుకి ఇండియా మూడు కోట్ల కార్ల ఉత్ప‌త్తి మైలురాయిని దాటింద‌ని ఎస్ఎంసి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. "జ‌పాన్ త‌ర్వాత ప్ర‌పంచంలో ఎస్ఎంసి ఈ మైలురాయిని న‌మోదు చేసిన రెండో దేశం భార‌త్‌. జ‌పాన్‌లో ఈ మైలురాయిని చేర‌డానికి 55 సంవ‌త్స‌రాల 2 నెల‌ల కాలం ప‌డితే భార‌త్ లో 40 సంవ‌త్స‌రాల 4 నెల‌ల కాలంలోనే ఈ ఘ‌న‌త సాధించింది" అని ఎస్ఎంసి తెలిపింది. 
కేంద్ర‌ప్ర‌భుత్వం, సుజుకి మోటార్ కార్పొరేషన్‌ జాయింట్ వెంచ‌ర్ అయిన మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ తొలి మోడ‌ల్ కారు మారుతి 800 ఉత్ప‌త్తిని 1983లో ప్రారంభించింది. తొలి కారు మారుతి 800ను 1983 డిసెంబ‌రు 14వ తేదీన మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఢిల్లీ మార్కెట్లో నాడు కారు ధ‌ర రూ.52,500. ఆ రోజుల్లో ఆ కారుకి భారీ డిమాండు ఉంది. పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించిన లాట‌రీలో ఎంపికైన తొలి క‌స్ట‌మ‌ర్లు 10 మందికి నాటి ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా కార్ల తాళాలు అందించారు. అలా ప్రారంభ‌మైన మారుతి ప్ర‌స్థానం 2024 మార్చి చివ‌రి నాటికి 3 కోట్ల కార్ల ఉత్ప‌త్తి మైలురాయిని దాటింది. 
ప్ర‌స్తుతం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కు (ఎంఎస్ఐఎల్‌) గురుగ్రామ్‌, మ‌నేసార్ (హ‌ర్యానా), హ‌న్స‌ల్‌పూర్ ల‌లో (గుజ‌రాత్‌) మారుతి త‌యారీ ప్లాంట్లున్నాయి.  ఈ యూనిట్ల నుంచి నిరంత‌రం కార్లు వెలుప‌లికి వ‌స్తూ ఉన్నాయి. "ఈ 3 కోట్ల కార్ల‌లో 2.68 కోట్ల కార్లు హ‌ర్యానా కేంద్రంగా ప‌ని చేస్తున్న రెండు ప్లాంట్ల‌లోనే ఉత్ప‌త్తి అయ్యాయి. 32 ల‌క్ష‌ల కార్లు ఎంఎస్ఐఎల్ అనుబంధ సంస్థ సుజుకి మోటార్ గుజ‌రాత్ ప్లాంట్ లో ఉత్ప‌త్తి అయ్యాయి" అని కంపెనీ పేర్కొంది.
ఎం 800 సంచ‌ల‌నం

తొలి మారుతి కారు ఎం 800 దేశంలో వ్య‌క్తిగ‌త ర‌వాణాను విప్ల‌వాత్మ‌కంగా మార్చి వేసింది. 29 ల‌క్ష‌ల‌కు పైగా యూనిట్ల‌తో ఈ మోడ‌ల్ ఈ 3 కోట్ల మైలురాయి సాధ‌న‌లో కీల‌క పాత్ర పోషించింది. త‌ర్వాతి కాలంలో ఆల్టో 800, ఆల్టో కె10, స్విఫ్ట్, వేగ‌న్‌-ఆర్‌, డిజైర్‌, ఓమ్ని, బాలెనో, ఈకో, బ్రెజ్జా, ఎర్టిగా కార్లు కూడా ఈ మైలురాయిని సాధించ‌డంలో త‌మ వంతు వాటా అందించాయి.  
"మేక్ ఇన్ ఇండియా"కు క‌ట్టుబ‌డి ఉన్నాం

"మేం "మేక్ ఇన్ ఇండియా"కు క‌ట్టుబ‌డి ఉన్నాం. దేశీయ‌, ప్ర‌పంచ మార్కెట్ల అవ‌స‌రాలు తీర్చ‌డం ల‌క్ష్యంగా దేశంలో మా కార్య‌క‌లాపాలు ప‌టిష్ఠం చేస్తున్నాం. మొత్తం కార్ల ఎగుమ‌తుల్లో 40 శాతం వాటా మేం కొన‌సాగిస్తాం. క‌స్ట‌మ‌ర్ల డిమాండ్లు, ఆకాంక్ష‌లు తీర్చ‌డం కోసం మేం కార్ల ఉత్ప‌త్తిపై మరింత‌గా ఇన్వెస్ట్  చేస్తాం. 2030-31 నాటికి కార్ల వార్షిక ఉత్ప‌త్తిని 40 ల‌క్ష‌ల‌కు పెంచుతున్నాం. ఇందులో భాగంగా హ‌ర్యానాలోని ఖార్కోడా, గుజ‌రాత్‌ల‌లో రెండు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయ‌బోతున్నాం. మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి కార్ల మోడ‌ళ్ల సంఖ్య‌ను 2030-31 నాటికి 28కి పెంచాల‌నుకుంటున్నాం". 
- ఎంఎస్ఐఎల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్, సిఇఓ హిసాషి ట‌కూచీ


ఈ ఏడాది వేత‌న వృద్ధి 20 శాతం


ఈ ఏడాది దేశంలో సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో వేత‌నాల వృద్ధి 20 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ప్ర‌తిభ‌ను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించ‌డం, ఇన్నోవేష‌న్ కు ప‌ట్టం క‌ట్ట‌డంపై వివిధ కంపెనీలు ప‌ట్టం క‌డ‌తాయ‌ని ఒక అధ్య‌య‌నంలో తేలింది. ప‌టిష్ఠంగా ఉన్న దేశ ఆర్థిక వాతావ‌ర‌ణ‌మే ఇందుకు కార‌ణం. మైకేల్ పేజ్ ఇండియా శాల‌రీ గైడ్ 2024 నివేదిక‌లో ఈ అంశాలు చోటు చేసుకున్నాయి. బిఎఫ్ఎస్ఐ, ఇంజ‌నీరింగ్ & త‌యారీ, ఫైనాన్స్ & అకౌంటింగ్‌, హెల్త్ కేర్ & లైఫ్ సైన్సెస్‌, మాన‌వ వ‌న‌రులు, లీగ‌ల్‌, కంప్ల‌యెన్స్, వ‌స్తు స‌ర‌ఫ‌రా & స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌, ప్రాప‌ర్టీ & నిర్మాణం, సేల్స్ & మార్కెటింగ్, టెక్నాల‌జీ వంటి విభాగాల్లో ఈ స‌ర్వే నిర్వ‌హించారు.

నివేదిక‌లో ప్ర‌ధానాంశాలు...

- సాంప్ర‌దాయిక ప‌రిశ్ర‌మ‌ల్లో నియామ‌కాలు ఊపందుకున్నాయి. త‌యారీ, నిర్వ‌హ‌ణ కార్య‌క‌లాపాల్లో ఉద్యోగాల‌కు అధిక డిమాండు ఉంది. 

- డేటా అన‌లిటిక్స్, జెన‌రేటివ్ ఎఐ, మెషీన్ లెర్నింగ్ వృత్తి నిపుణుల‌కు డిమాండు పెరిగింది. 

- రంగాల‌వారీగా చూస్తే ఐటి, టెక్నాల‌జీ రంగంలో జూనియ‌ర్ ఉద్యోగుల స్థాయిలో  వేత‌న వృద్ధి 35-45 శాతం ఉండ‌వ‌చ్చు. అలాగే ఈ వృద్ధి  మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 30-40 శాతం, సీనియ‌ర్ మేనేజ్ మెంట్ స్థాయిలో 20-30 శాతం ఉండ‌వ‌చ్చు. 

- ప్రాప‌ర్టీ , నిర్మాణ రంగంలో వేత‌న వృద్ధి వ‌రుస‌గా 20-40 శాతం (జూనియ‌ర్‌) 25-45 శాతం (మిడ్‌లెవెల్ ఎగ్జిక్యూటివ్‌), 20-40 శాతం (సీనియ‌ర్ మేనేజ్‌మెంట్‌) ఉండ‌వ‌చ్చు.

- ఉద్యోగ మార్కెట్లో స్థితిస్థాప‌క‌త‌, ప‌ని సంస్కృతి, వృత్తిలో వృద్దికే అభ్య‌ర్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు.

శాకాహార భోజ‌నం ధ‌ర భ‌గ్గు

 శాకాహార భోజ‌నం ధ‌ర‌ల‌పై ఉల్లి ఘాటు, టొమాటో, బంగాళాదుంప ధ‌ర‌ల కాటు పడింది. మార్చిలో శాకాహార భోజ‌నం ధ‌ర‌లు 7 శాతం పెరిగాయ‌ని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అనుబంధ విభాగం అధ్య‌య‌నంలో తేలింది. ఇదే నెల‌లో పౌల్ర్టీ ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గిన కార‌ణంగా మాంసాహార భోజనం ధ‌ర‌లు మాత్రం 7 శాతం త‌గ్గిన‌ట్టు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్  అండ్ అనాలిసిస్ "రోటీ రైస్ రేట్" పేరిట రూపొందించిన  నివేదిక‌లో తెలిపింది. 


సాధార‌ణంగా రొట్టె, కూర (ఉల్లిపాయ‌, టొమాటా, బంగాళాదుంప‌), అన్నం, ప‌ప్పు, పెరుగు, స‌లాడ్ భాగమైన శాకాహార భోజ‌నం ప్లేటు ధ‌ర గ‌త ఏడాది మార్చిలో రూ.25.50 ఉంటే ఈ మార్చిలో రూ.27.30కి చేరింది. అయితే ఫిబ్ర‌వ‌రి ధ‌ర రూ.27.40 క‌న్నా త‌క్కువ‌గానే ఉంది. ఉల్లి ధ‌ర 40 శాతం, టొమాటా ధ‌ర 36 శాతం, బంగాళాదుంప ధ‌ర  22 శాతం పెర‌గ‌డం వ‌ల్ల శాకాహార భోజ‌నం ధ‌ర పెరిగింది. స‌ర‌ఫ‌రా త‌గ్గ‌డం వ‌ల్ల గ‌త ఏడాది మార్చితో పోల్చితే బియ్యం ధ‌ర 14 శాతం, ప‌ప్పుల ధ‌ర 22 శాతం పెరిగింద‌ని ఆ నివేదికలో తెలిపారు. అయితే మాంసాహార భోజ‌నంలో ప‌ప్పు స్థానంలో చికెన్ పెట్ట‌డంతో ఈ భోజ‌నం ప్లేటు ధ‌ర గ‌త ఏడాది మార్చితో పోల్చితే రూ.59.20 నుంచి రూ.54.90కి త‌గ్గింది. ఈ కాలంలో బ్రాయిల‌ర్ చికెన్ ధ‌ర 16 శాతం త‌గ్గింది. భోజ‌నం మొత్తం ధ‌ర‌లో చికెన్ వాటా 50 శాతం  ఉంటుంది. అయితే ఫిబ్ర‌వ‌రితో పోల్చితే రంజాన్ మాసం కావ‌డం  వ‌ల్ల బ్రాయిల‌ర్ చికెన్ ధ‌ర 5 శాతం పెరిగింది.


Monday, April 1, 2024

నూతన ఆర్థికం-శుభారంభం

కొత్త ఆర్థిక‌ సంవ‌త్స‌రం కొత్త రికార్డులు, శుభ‌సూచిక‌ల‌తో ప్రారంభ‌మ‌యింది. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రం తొలి రోజునే స్టాక్ మార్కెట్ కొత్త‌ రికార్డులతో ప్రారంభం కాగా ఆదివారంతో ముగిసిన ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆటోమొబైల్ రంగంలోని ప్ర‌ధాన కంపెనీలు రికార్డు అమ్మ‌కాలు ప్ర‌క‌టించాయి. అలాగే జిఎస్‌టి వ‌సూళ్లు కూడా మార్చి నెల‌లో రెండో చారిత్ర‌క రికార్డును న‌మోదు చేశాయి. 


ఈక్విటీ మార్కెట్లో కొత్త రికార్డు

స‌ర్వ‌త్రా సానుకూల సంకేతాల న‌డుమ స్టాక్ మార్కెట్ నూత‌న ఆర్థిక సంవ‌త్స‌రానికి శుభారంభాన్నిచ్చింది. ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిలు న‌మోదు చేసిన‌ప్ప‌టికీ ముగింపు చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిల క‌న్నా స్వ‌ల్పంగా దిగువ‌న ఉంది. వ‌రుస‌గా మూడో సెష‌న్లో కూడా లాభాలు న‌మోదు చేసిన సెన్సెక్స్ సోమవారం (ఏప్రిల్ 1, 2024) ఇంట్రాడేలో 603.27 పాయింట్ల లాభంతో 74254.62 పాయింట్ల చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది. చివ‌రికి 363.20 పాయింట్ల లాభంతో 74014.55 వ‌ద్ద ముగిసింది. సెన్సెక్స్ చారిత్ర‌క ముగింపు  మార్చి 27వ తేదీన న‌మోదైన 74119.39 పాయింట్లు. నిఫ్టీ కూడా సోమ‌వారం 203.05 పాయింట్ల లాభంతో 22529.95 పాయింట్ల చారిత్ర‌క రికార్డును న‌మోదు చేసింది.. అయితే చివ‌రికి లాభాల‌ను 135.10 పాయింట్ల‌కు ప‌రిమితం చేసుకుని 22462 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ చారిత్ర‌క ముగింపు మార్చి 27న న‌మోదైన 22493.55 పాయింట్లు.

--------------------------------------- 

ఆటోమొబైల్  మార్కెట్ జిలుగులు


2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆటోమొబైల్ మార్కెట్  అమ్మ‌కాల్లో కొత్త రికార్డులు న‌మోదు చేసింది. 2022-23తో పోల్చితే కార్ల అమ్మ‌కాలు 9 శాతం పెరిగి 38.9 ల‌క్ష‌ల యూనిట్ల నుంచి 42.3 ల‌క్ష‌ల యూనిట్ల‌కు పెరిగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆటోమొబైల్ రంగం అమ్మ‌కాల్లో ఇది కొత్త రికార్డు. ప్ర‌ధానంగా కార్ల మార్కెట్లో అగ్ర‌గామి అయిన మారుతి సుజుకీ, ప్ర‌త్య‌ర్థి హుండై మోటార్ ఇండియాతో పాటు ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్ కంపెనీ అమ్మ‌కాల్లో కొత్త రికార్డులు న‌మోదు చేశాయి. దేశంలో కార్ల అమ్మ‌కాలు ఒక ఏడాదిలో 40 ల‌క్ష‌లు దాట‌డం ఇదే ప్ర‌థ‌మం. ఎస్ యువిల ప‌ట్ల ప్ర‌జ‌లు అధిక ఆద‌ర‌ణ చూప‌డం ఇందుకు దోహ‌ద‌ప‌డింది. మొత్తం కార్ల విక్ర‌యాల్లో ఎస్‌యువిల వాటా 2022-23తో పోల్చితే 43 శాతం నుంచి 50.4 శాతానికి పెరిగింది. 

- మారుతి సుజుకీ ఇండియా ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తం మీద చ‌రిత్ర‌లోనే గ‌రిష్ఠ స్థాయిలో 17,93,644 కార్లు విక్ర‌యించ‌డంతో పాటు విదేశాల‌కు రికార్డు స్థాయిలో 2,83,067 కార్లు ఎగుమ‌తి చేసింది. 

- హుండై మోటార్స్ ఇండియా కూడా 7,77,876 కార్లు విక్ర‌యించి కొత్త రికార్డు న‌మోదు చేసింది. 2022-23లో విక్ర‌యించిన 7,20,565 కార్ల‌తో పోల్చితే అమ్మ‌కాల్లో 8 శాతం వృద్ధి న‌మోద‌యింది. 

- ట‌యోటా కిర్లోస్క‌ర్  మోటార్ ఇండియా లిమిటెడ్ గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో 2,63,512 కార్లు విక్ర‌యించింది. కంపెనీ అమ్మ‌కాల్లో ఇది కొత్త రికార్డు. 2022-23 సంవ‌త్స‌రం అమ్మ‌కాలు 1,77,683 యూనిట్ల‌తో పోల్చితే అమ్మ‌కాలు 48 శాతం పెరిగాయి. 

- ద్విచ‌క్ర వాహ‌న కంపెనీలు టివిఎస్ మోటార్‌, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కూడా అమ్మ‌కాల్లో కొత్త రికార్డులు న‌మోదు చేశాయి. టివిఎస్ మోటార్ కంపెనీ చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిలో 4.19 ల‌క్ష‌ల వాహ‌నాలు (14 శాతం వృద్ధి) విక్ర‌యించ‌గా సుజుకి మోటార్ సైకిల్ ఇండియా 11,33,902 వాహ‌నాలు (21 శాతం వృద్ధి) విక్ర‌యించింది.

-------------------------------------- 

జిఎస్‌టి క‌లెక్ష‌న్ల‌లోనూ అదే జోరు


2022-24 ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి నెల మార్చిలో జిఎస్‌టి వ‌సూళ్లు  రూ.1.78 ల‌క్ష‌ల కోట్లుగా న‌మోద‌య్యాయి. 2022-23 మార్చితో పోల్చితే ఇది 11.5 శాతం అధికం. దేశంలో జిఎస్‌టి ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత వ‌సూళ్లలో రెండో గ‌రిష్ఠ స్థాయి ఇది. 2023 ఏప్రిల్‌లో న‌మోదైన రూ.1,87,035 కోట్లు ఇప్ప‌టివ‌ర‌కు జిఎస్‌టి వ‌సూళ్ల‌లో చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయి. కాగా 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో నెల‌వారీ స‌గ‌టు వ‌సూలు రూ.1.68 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. 2022-23లో ఈ స‌గ‌టు రూ.1.5 ల‌క్ష‌ల కోట్లు. 

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...