కోవిడ్-19ని అదుపు చేసేందుకు ఇటీవల ఆర్ బిఐ, ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ప్రభావం వల్ల ఈ ఏడాది బ్యాంకుల ఎన్ పిఏలు (మొండి బకాయిలు) భారీగా పెరిగిపోనున్నాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి 8.6 శాతం ఉన్న ఈ ఎన్ పిఏలు వచ్చే ఏడాదికి 11.6 శాతానికి దూసుకుపోవచ్చునంటున్నారు. అలాగే ఇప్పటివరకు ప్రామాణిక రుణాలుగా ఉన్న వాటిలో 5.5 శాతం ఖాతాలు తాజాగా ఎన్ పిఏల్లోకి జారుకోవచ్చునని కూడా అంటున్నారు. ఇటీవల చర్యల ప్రభావం వల్ల బ్యాంకుల రుణవితరణ బాధ్యత పెరిగిపోవడంతో పాటు ఆదాయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చెబుతోంది. ఇలాంటి వాతావరణంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ ఏడాది రూ.45 వేల కోట్ల నుంచి రూ.82500 కోట్ల వరకు అదనపు పెట్టుబడుల మద్దతు అవసరం కావచ్చునని అంచనా వేసింది. లాక్ డౌన్ ప్రభావం వల్ల రుణ గ్రహీతల రుణాల చెల్లింపు సామర్థ్యం భారీగా దెబ్బ తిన్నదని తేల్చి చెప్పింది. బ్యాంకులు ఎన్ పిఏల కోసం చేసుకునే కేటాయింపులు ఈ ఏడాది భారీగా ఉండవచ్చునని, దీని ప్రభావం వల్ల వరుసగా ఆరో ఏడాది కూడా భారీ నష్టాలు నమోదు చేసే ఆస్కారం ఉన్నదని క్రిసిల్ తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
ఒక్క రోజులో 4,71,751 విమాన ప్రయాణాలు
విమానయానం కొత్త రికార్డు దేశీయంగా విమానయాన రంగం ఒక కొత్త రికార్డును నమోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...
-
fo r May 21, 2019 Forenoon Better Tithi : Vaisakha Bahula Tadiya Nakshatra : Moola Persons born in Rohini, Hasta, Shravanam...
-
ఆగస్ట్ 6 - 11 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ నిఫ్టీ : 19517 (-129) గత వారంలో నిఫ్టీ 19867 - 19588 పాయింట్ల మధ్యన కదలాడి 96 ...
-
సెప్టెంబర్ 18-22 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ నిఫ్టీ : 20192 (+372) గత వారంలో నిఫ్టీ 19810 - 20222 పాయింట్ల మధ్యన కదలా...
No comments:
Post a Comment