Thursday, March 26, 2020

క‌రోనాపై ఉమ్మ‌డి పోరాటానికి జి-20 భూరి నిధులు


కోవిడ్‌-19 ప్ర‌భావం కార‌ణంగా అత‌లాకుత‌లం అయిన ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకునేలా చేయ‌డానికి జి-7 దేశాలు (సంప‌న్న దేశాల కూట‌మి), సామాజిక‌, ఆర్థిక‌, విత్త‌ప‌ర‌మైన సంక్లిష్ట ప‌రిస్థితిని ఎదుర్కొన‌డానికి  5 ట్రిలియ‌న్ డాల‌ర్లు నిధులు పంపిణీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. క‌రోనాపై ఉమ్మ‌డి పోరాటంలో భాగంగా తాము ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు జి-20 దేశాలు ఆన్ లైన్ లో నిర్వ‌హించిన శిఖ‌రాగ్ర స‌మావేశంలో వెల్ల‌డించాయి. ఈ స‌మావేశంలో పాల్గొన్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కోవిడ్‌-19ని దీటుగా ఎదుర్కొన‌డానికి ఒక ప‌టిష్ఠ‌మైన కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని పిలుపు ఇచ్చారు. సంఘ‌టిత స్ఫూర్తితో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌మైన‌, భారీ స్థాయి, శాస్ర్తీయ‌త‌తో కూడిన స్పంద‌న అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ప్ర‌పంచం యావ‌త్తుకు ఉమ్మ‌డి ముప్పుగా భావిస్తున్న ఈ వైర‌స్ పై ఐక్య పోరాటానికి భార‌త్ క‌ట్టుబ‌డి ఉన్న‌ద‌ని మోదీ హామీ ఇచ్చారు. ఈ భారీ నిధి ప్ర‌పంచ న‌ష్టాల తీవ్ర‌త‌ను త‌గ్గిస్తుంద‌ని, ఉపాధిని ర‌క్షించి వృద్ధిలో వేగం పెర‌గ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని జి-20 దేశాలు త‌మ ప్ర‌క‌ట‌న‌లో ఆశాభావం ప్ర‌క‌టించాయి.

No comments:

Post a Comment

మే నెల‌లోనూ మార్కెట్లు ముందుకే...

స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా...