Thursday, March 26, 2020

స్టాక్ మార్కెట్ లో హ్యాట్రిక్ ర్యాలీ

మూడో రోజూ భారీ లాభాల్లో ఇండెక్స్ లు

భార‌త స్టాక్ మార్కెట్ వ‌రుస‌గా వ‌రుస‌గా మూడో రోజున కూడా మంచి ర్యాలీ కొన‌సాగించింది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్ డౌన్ సానుకూల ఫ‌లితాలు ఇస్తున్న‌ద‌న్న వార్త‌ల‌తో పాటు బాధిత నిరుపేద కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రూ.1.7 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజిని ప్ర‌క‌టించ‌డం మార్కెట్ సెంటిమెంట్ ను బ‌ల‌ప‌రిచింది. గురువారంనాడు ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ న‌ష్టాల్లోనే ట్రేడ‌యినా భార‌తదేశంలోని సెన్సెక్స్ 1410.99 పాయింట్లు లాభ‌ప‌డి 29,946.77 పాయింట్ల వ‌ద్ద ముగియ‌గా నిఫ్టీ 323.60 పాయింట్లు లాభ‌ప‌డి 8641.45 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది. సోమ‌వారం నాటి చారిత్ర‌క ప‌త‌నం అనంత‌రం ఏర్ప‌డిన ర్యాలీలో 3 రోజుల్లో సెన్సెక్స్ 3965.53 పాయింట్లు, నిఫ్టీ 1031.20 పాయింట్లు లాభ‌ప‌డ్డాయి. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు శుభ‌సూచ‌కంగా భావించే క్రూడాయిల్ ధ‌ర‌లు కూడా బ్యారెల్ 30 డాల‌ర్ల లోపునే ఉండ‌డం కూడా క‌లిసివ‌చ్చింది. అయితే షాంఘై, హాంకాంగ్‌, టోక్యో, సియోల్ సూచీలు గ‌ణ‌నీయ‌మైన న‌ష్టాల్లో ముగియ‌గా యూరోపియ‌న్ దేశాల సూచీలు న‌ష్టాల్లో ట్రేడ‌య్యాయి. 

3 రోజుల్లో రూ.11.12 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద వృద్ధి
వ‌రుస‌గా మూడు రోజులుగా సాగిన ర్యాలీలో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.11,12,088.88 కోట్లు పెరిగింది. దీంతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,12,99,025.06 కోట్ల‌కు చేరింది.

---------------------------------- 

దేశంలో క‌రోనా వైర‌స్ దారికొస్తున్న ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. 4 వారాల పాటు వ‌రుస‌గా అధిక సంఖ్య‌లో కేసులు పెరుగుతూ పోగా తొలి సారిగా బుధ‌, గురువారాల మ‌ధ్య‌న (25, 26 తేదీలు) 24 గంట‌ల వ్య‌వ‌ధిలో తొలిసారిగా త‌క్కువ కేసులు న‌మోదైన‌ట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. గ‌త 4 వారాలుగా కొత్త‌గా న‌మోదైన కేసుల సంఖ్య రోజుకి 70 నుంచి 80 వ‌ర‌కు ఉండ‌గా తొలిసారిగా 24 గంట‌ల్లో 43 కొత్త కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. మార్చి 26వ తేదీ నాటికి 26 రాష్ర్టాల్లో క‌రోనా కేసుల సంఖ్య 649కి చేర‌గా మృతుల సంఖ్య 13కి పెరిగింది.

- 26వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న తాజా స‌మాచారం ప్ర‌కారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 197 దేశాల్లో 4,16,686 మందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టు నిర్ధార‌ణ కాగా మృతుల సంఖ్య 18,589కి చేరింది. గ‌తంలో సార్స్, మెర్స్ వంటి వైర‌స్ ల వ్యాప్తి స‌మ‌యంలో ఏర్ప‌డిన మ‌ర‌ణాల సంఖ్య‌ను కోవిడ్‌-19 మ‌ర‌ణాలు దాటేశాయి. ఎబోలా వైర‌స్ స‌మ‌యంలో మృతుల సంఖ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌రిష్ఠంగా 11300 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 

No comments:

Post a Comment

మే నెల‌లోనూ మార్కెట్లు ముందుకే...

స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా...